హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికి వద్ద నుంచి రూ.34.24లక్షల విలువైన 763.66 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ డబ్బాలో పెట్టుకొని అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహించగా.. బంగారం దొరికింది. దీంతో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని ఎక్కడికి తరలిస్తున్నాడనే కోణంలో విచారిస్తున్నారు.