బడంగ్పేట: చీరల దొంగతనం చేసిన వ్యక్తి పట్టుబడ్డ సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం కుషాయిగూడ సూర్యప్రభ అపార్టుమెంట్, బృందావన్కాలనీలో ఉంటున్న సన్నీఅనే యువకుడు మహిళల దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్నాడని ఆయన తెలిపారు. ఇప్పటివరకు వేర్వేరు మహిళలకు చెందిన 15 చీరలను దొంగిలించాడన్నారు. ఆ చీరలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.40వేలు ఉంటుందన్నారు. సన్నీమీద ఇప్పటికే బంజారహిల్స్, పంజాగుట్ట, కేపీహెచ్బీ తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు తెలిపారు. సన్నీని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు సీఐ తెలిపారు.