రంగారెడ్డి : జిల్లాలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి తొర్రూర్ సమీపంలో నకిలీ పురుగుల మందులు తయారు చేస్తున్న గోదాంపై భువనగిరి ఎస్వోటీ పోలీసుల దాడి చేశారు. నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ. 7 లక్షల విలువైన నకిలీ పురుగుల మందులు, తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. నకిలీ పురుగుల మందులు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు