చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ గ్రామం సమీపంలోని మున్నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. ఎస్సై లవణ్కుమార్ మాట్లాడుతూ ఎటువంటి కూపన్లు లేకుండా ఇసుకను ఖమ్మం తరలిస్తుండగా మార్గ మధ్యంలో పెట్రోలింగ్ చేస్తుండగా జగన్నాథపురం వద్ద 4, లచ్చగూడెం గ్రామం వద్ద 4 ట్రాక్టర్లు ఏఎస్సైలు పాపయ్య, శ్రీనివాసరావులు పట్టుకొని, సదరు ట్రాక్టర్లను చింతకాని పోలీస్స్టేషన్కు తరలించి యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని, వారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని పేర్కొన్నారు.