భువనేశ్వర్: వంద రూపాయలు ఇవ్వనందుకు మాజీ వైస్ ఛాన్సలర్ను ఒక వ్యక్తి హత్య చేశాడు. ఒడిశాలోని జార్సుగూడలో ఈ ఘటన జరిగింది. సంబల్పూర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ధూర్బారాజ్ నాయక్ ఇంట్లోకి ఒక వ్యక్తి బలవంతంగా ప్రవేశించాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కనీసం వంద రూపాయలు అయినా ఇవ్వాలని అడిగాడు. నాయక్ నిరాకరించడంతో అక్కడే ఉన్న గొడ్డలితో ఆయనపై దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జార్సుగూడ ఎస్పీ బీసీ దాస్ తెలిపారు.