న్యూఢిల్లీ: ఇంగ్లండ్ కొత్తగా తీసుకొస్తున్న ‘హండ్రెడ్’ టోర్నీలో భారత మహిళా క్రికెటర్ల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్తో పాటు, స్మృతి మందన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తిశర్మ..హండ్రెడ్ టోర్నీలో బరిలోకి దిగుతుండగా, తాజాగా యువ సంచలనం షెఫాలీ వర్మ ఈ జాబితాలో చేరింది. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న 17 ఏండ్ల షెఫాలీతో బర్మింగ్హామ్ ఫోనిక్స్ ఫ్రాంచైజీ ఒప్పందం చేసుకుంది.