కృష్ణా : లారీ బోల్తాపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లాలో బుధవారం చోటు చేసుకున్నది. బియ్యం లోడుతో లారీ బెంగళూరుకు వెళ్తోంది. బియ్యం బస్తాలపై కూతురుతో కలిసి దంపతులు కూర్చున్నారు. ఈ క్రమంలో గన్నవరం మండలం కేసరపల్లి వద్ద లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో ముగ్గురు బియ్యం బస్తాల కింద పడి మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బియ్యం బస్తాల కింద నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.