మణప్పురం కార్యాలయంలో చోరీ యత్నం!

మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలో ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయంలో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. దొంగతనానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని న్యూ టౌన్లో శనివారం అర్థరాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మణప్పురం కార్యాలయం వద్ద శబ్దాలు రావడంతో అప్రమత్తమైన పోలీసులు లోపలికి వెళ్లి చూశారు. చోరీకి పాల్పడుతన్న ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. కార్యాలయం తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన దుండగులు దొంగతనానికి ప్రయత్నించారని వెల్లడించారు. అయితే గోల్డ్ లోన్ కార్యాలయంలో ఏదైనా చోరీకి పాల్పడ్డరా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఘటనా స్థలాన్ని పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తాజావార్తలు
- అమెజాన్ క్విజ్.. ఫ్రీగా ఐఫోన్12.. ఇవీ సమాధానాలు
- 241 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్
- ఇంధన ధరల పెరుగుదలపై కేంద్రంపై రాహుల్ ఆగ్రహం
- టీమిండియాను సర్కస్లో జంతువులలాగా చూశారు!
- WEF సదస్సులో 28న ప్రధాని ప్రసంగం..!
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్