హైదరాబాద్ : నెహ్రూ జూలాజికల్ పార్క్లోని ఎనిమిది ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. సింహాల నుంచి అధికారులు నమూనాలను సేకరించి, పరీక్షల కోసం సీసీఎంబీకి పంపారు. మంగళవారం ఎనిమిది సింహాలకు సంబంధించిన కొవిడ్ పరీక్షల నివేదికలు వచ్చే అవకాశం ఉందని జూ అధికారులు పేర్కొన్నారు. పార్క్లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు. సఫారీ ప్రాంతం 40 ఎకరాలు ఉండగా.. ఇందులో పది సంవత్సరాల వయసున్న 12 సింహాలు ఉన్నాయి.
వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు మహమ్మారి బారినపడ్డట్లు తెలుస్తోంది. దేశంలో పెరుగుతున్న కరోనా పెరుగుదల నేపథ్యంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ నెల 2న నెహ్రూ జూ ప్కార్తో పాటు పలు పార్క్లను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయితే సింహాలు మహమ్మారి బారినపడడం దేశంలోనే తొలిసారి. గతేడాది ఏప్రిల్లో న్యూయార్క్లోని ఓ జూలో ఎనిమిది పులులు, సింహాలు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత హాంగాంగ్లో కుక్కలు, పిల్లుల్లో వైరస్ లక్షణాలను గుర్తించారు.