లక్నో : యూపీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారింది. భాగ్పట్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో రెవెన్యూ అధికారి (ఏడీఓ) డ్రైవర్పై దాడిచేసిన దోపిడీ ముఠా అతడి వద్ద నుంచి ఏడీఓకు చెందిన లైసెన్డ్ గన్ను గుంజుకుని పరారైంది. ఘటనా ప్రాంతంలో గాయాలతో పడిఉన్న డ్రైవర్ను గౌరవ్గా గుర్తించారు. గౌరవ్ను చికిత్స నిమిత్తం పోలీసులు దవాఖానకు తరలించారు.
భాగ్పట్ ఏడీఓ కృష్ణపాల్ సింగ్ ఘటన గురించి వివరిస్తూ తాను సోమవారం తన డ్రైవర్ గౌరవ్తో కలిసి జిల్లా పంచాయత్రాజ్ అధికారి (డీపీఆర్వో) కార్యాలయానికి వెళ్లానని, పని పూర్తయిన అనంతరం డ్రైవర్తో ఫోన్లో మాట్లడగా ఎలాంటి స్పందనా రాలేదని తెలిపారు. సాయంత్రం 4.15 గంటల సమయంలో గౌరవ్పై కాల్పులు జరపగా గాయాలతో పడిఉన్నాడని తనకు సమాచారం అందిందని చెప్పారు. ఆపై ఘటనా స్ధలానికి పోలీసులతో కలిసి చేరుకుని డ్రైవర్ను దవాఖానకు తరలించామని తెలిపారు. డ్రైవర్ వద్ద ఉన్న తన పిస్టల్ కూడా గల్లంతయిందని ఆయన వెల్లడించారు.