కొణిజర్ల: బంతిపూలు కోసేందుకు వెళ్తున్న కూలీల ఆటోను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న10మంది కూలీలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మండలంలోని కొణిజర్లలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మాచినేని రవి తెలిపిన ప్రకారం పల్లిపాడుకు చెందిన రాచబంటి విశ్వనాథం అనే వ్యక్తి తన సొంత ఆటోలో తాను సాగుచేస్తున్న బంతిపంటలో పూలు కోసేందుకు కూలీలను ఎక్కించుకొని బయల్దేరాడు. పంటపొలానికి సమీపంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. గాయాలపాలైన బాధితులను చికిత్స కోసంప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.