హైదరాబాద్ : ములుగు మండలం పందికుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. రోజువారీ విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై నర్సంపేట డిపోకు బయలుదేరిన కంట్రోలర్ సదానందం, కండక్టర్ సునీతను పందికుంట వద్ద మృత్యువు రూపంలో వచ్చిన డీసీఎం వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.