బంజారాహిల్స్,సెప్టెంబర్ 3 : జూబ్లీహిల్స్ రోడ్ నెం 78లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినిమాల్లో లైట్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సమీపంలోని పర్వత్నగర్లో నివాసం ఉంటున్న నడిగడ్డ రాజు(46) తెలుగు సినీ అండ్ టీవీ అవుట్డోర్ లైట్మెన్ యూనియన్లో సభ్యుడి ఉన్నాడు.
20ఏళ్లుగా ఆనంద్ సినీ సర్వీసెస్లో లైట్మెన్గా పనిచేస్తున్న రాజు శుక్రవారం ఉదయం పద్మాలయా స్టూడియో సమీపంలో ఆనంద్ సినీ సర్వీసెస్ కార్యాలయానికి వెళ్తున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 78లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సమీపంలోని రాగానే ఆనంద్ సినీ సర్వీసెస్కు చెందిన బస్సు (ఏపీ 09బీకే1099) అదుపుతప్పిన వేగంతో వచ్చి రాజును ఢీకొట్టింది.
దాంతో కిందపడిపోయిన అతడి తలపై ముందు టైర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య శాంత ఇచ్చిన ఫిర్యాదుతో బస్సు డ్రైవర్ బసవయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.