కల్లూరు : చెరువులో దూకి ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పాత ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మల్కాపురపు శ్రీనివాసరావు(42) గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసరావు ఆర్ధిక సమస్యలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.