బెంగళూరు : వేగంగా వెళ్తున్న ఓ స్కూటీకి నెమలి అడ్డుగా రావడంతో.. ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపి – మంగళూరు హైవేపై సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఉడిపి జిల్లాలోని బేలపు గ్రామానికి చెందిన ఓ 24 ఏండ్ల యువకుడు పని నిమిత్తం పాదుబిద్రికి స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడి స్కూటీకి అడ్డుగా నెమలి రావడంతో.. దాన్ని ఢీకొట్టాడు. దీంతో యువకుడు కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయమైంది. సమాచారం అందుకు పోలీసులు.. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నెమలి కూడా ఈ ప్రమాదంలో చనిపోయింది.