కామారెడ్డి : జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఆదివారం ఓ ఎలుగుబంటిని అటవీశాఖాధికారులు పట్టుకొని హైదరాబాద్కు తరలించారు. మండల పరిధిలోని చిట్యాల గ్రామ శివారులోకి ఎలుగుబంటి శనివారం ఉదయం కనిపించగా గ్రామస్తులు పట్టుకునే ప్రయత్నం చేయగా ఎదురుదాడి చేసింది. దీంతో గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో వారు అక్కడికి చేరుకొని వల సహాయంతో బంధించడానికి యత్నించగా ఎలుగుబంటి తప్పించుకోపోవడంతో వరంగల్ నుంచి ప్రత్యేక రెస్క్యూ టీమ్ను రప్పించారు. సదరు బృందం సభ్యులు శనివారం ఎలుగుబంటి ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టి దానికి గన్ ద్వారా మత్తు ఇంజక్షన్ ఇచ్చారు.
కాసేపటికి దానిని బంధించి హైదరాబాద్కు తరలించారు. అక్కడి నుంచి ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలో వదిలి వేస్తామని డీఎఫ్ఆర్వో సాగర్, రేంజ్ అధికారి పద్మ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం