అక్రమంగా అమ్ముతున్న ముగ్గురి అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ)/చర్లపల్లి: కొవిడ్ నిరోధక టీకాలైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బుధవారం వేర్వేరుచోట్ల అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు అరెస్టుచేశారు. బోడుప్పల్లోని మెడ్లైఫ్ మెడికల్ దుకాణం యజమాని కాటశాల భాస్కర్కు మెడికల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తాడి అంజన్కుమార్ ఒకడోసు రెమ్డెసివిర్ ఇంజక్షన్ను అక్రమంగా అమ్ముతుండగా.. మేడిపల్లి ఎస్సై రవికుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్ వారిని అదుపులోకి తీసుకున్నారు. మల్కాజిగిరి సర్కిల్లోని లక్ష్మీనగర్ నివాసి శేషుబాబు ఈసీఐఎల్ చౌరస్తాలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తుండగా మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఇంజక్షన్లు స్వాధీనం చేసుకొని నిందితుడిని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.