పహాడీషరీఫ్ : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 13 మంది పేకాటరాయుళ్లను రిమాండ్కు తరలించిన ఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ వివరాల ప్రకారం పోలీస్స్టేషన్ పరిధి షాహీన్నగర్లోని ఉస్మాన్నగర్లో శనివారం రాత్రి 11.15కు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు.
పేకాట ఆడుతున్న మహ్మద్ ఖాజాపాషా, షాహెద్ అలీ, మోసిన్ బిన్ యమాని, మిర్జా ఆయజ్ బేగ్, ముజీబ్, ఆరిఫ్, ఖలీం, అమ్జద్, నసీర్, రఫిక్, షౌకత్ అలీ, ఉస్మాన్ బిన్ మహ్మద్, సైయ్యద్ జాఫర్లను అరెస్టు చేసి వారి నుంచి నగదు రూ. 22 వేల 540, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 12 సెల్ఫోన్లు, 3 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం వారిని రిమాండ్కు తరలించారు.