పహాడీషరీఫ్: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం షాహీన్నగర్లోని హాబీబ్కాలనీలో ఆదే ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖరీం(30), మహ్మద్ షౌకత్(40), షేక్ సలీం(48), మహ్మద్ జముల్ ఉద్దీన్ ఖాన్(41),మహ్మద్ హయ్యూం(30)లు పేకాట ఆడుతున్నారు. మంగళవారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలంలో ఆరు సెల్ఫోన్లు, 19,540 నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం బుధవారం రిమాండ్కు తరలించారు.