పహాడీషరీఫ్: గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఏడుగురు పేకాటరాయుళ్లను రిమాండ్కు తరలించిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై పాండు వివరాల ప్రకారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామకాలనీలో నివాసముంటున్న సూర్య ప్రకాశ్ పాండ్య(37), నూకల కేశవులు(39), సీతారాం మహిపాల్(45), మోర్తావర్ రాజు(27), మాశెట్టి రాజ్కుమార్(48), దిలీఫ్ బోజప్ప(28), తుల్చెట్టి బాల భీం(28)లు సోమవారం పేకాట ఆడుతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఆ పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 17,130 నగదును, ప్లే కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.