ముంబై: కరోనా రోగికి చెందిన బంధువు ఒకరు డాక్టర్పై కత్తితో దాడి చేశాడు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ ఘటన జరిగింది. నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కరోనా రోగి చికిత్స పొందుతున్నాడు. అతడి బంధువు భూసాహెబ్ గైక్వాడ్ అక్కడి డాక్టర్తో వాగ్వాదానికి దిగాడు. దీంతో కరోనా వార్డులోని ఇతర రోగుల కుటుంబ సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భూసాహెబ్ వారితో వాదనకు దిగాడు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన డాక్టర్పై అతడు కత్తితో దాడి చేశాడు. అయితే పక్కన ఉన్న వారు భూసాహెబ్ను పట్టుకుని నిలువరించారు.
మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీని ఆధారంగా పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. డాక్టర్పై కత్తితో దాడి చేసిన భూసాహెబ్ గైక్వాడ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.