న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరల పెరుగుదుల కొనసాగుతోంది. పదిగ్రాముల పసిడి రూ 47,300 పైగా పలకగా, వెండి ధరలు సోమవారం రూ 70,500 దాటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు భారం కావడంతో పాటు రూపాయితో డాలర్ మారకం విలువ పెరగడంతో గోల్డ్, సిల్వర్ ధరలు ఎగబాకాయి.
ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం రూ 47,311 పలుకగా, కిలో వెండి రూ 235 పెరిగి ఏకంగా రూ 70,423కు చేరింది. మరోవైపు అమెరికాలో ప్రభుత్వ బాండ్ల రాబడి పడిపోవడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు దేశాల్లో కరోనా కేసులు తిరిగి పెరుగుతుండటం కూడా ప్రత్యామ్నాయ పెట్టుబడి వనరుగా గోల్డ్కు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంటున్నారు.