ములుగు : మావోయిస్టుల డంప్ను పోలీసులు కనుగొని వెలికితీశారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు చెందిన డంప్ను ములుగు జిల్లాలోని మాన్సింగ్ తాండలో పోలీసులు కనుగొన్నారు. ములుగు ఎస్ఐ హరికృష్ణ నేతృత్వంలోని టీం డంప్ను వెలికితీసింది. 312 లైవ్ రౌండ్ల మందుగుండు సామాగ్రి, రెండు డిటోనేటర్లు, మావోయిస్టు పార్టీకి చెందిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఘటనపై ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య మీడియా ద్వారా మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు బాంబు డిస్పోజల్ స్కాడ్ సభ్యులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఓ ఫోటోగ్రాఫర్తో పోలీసుల టీం సంఘటనా స్థలంలో తవ్వకాలు నిర్వహించిందన్నారు. 1.5 మీటర్ల లోతులో ఓ నల్లటి కవర్ దొరికిందన్నారు. దాన్ని పరిశీలించగా మందుగుండు సామాగ్రి లభించిందన్నారు.