మక్తల్ రూరల్, జూలై 9 : మొక్కల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అ న్నారు. మక్తల్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా శుక్రవారం స్థానిక ఈద్గా వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రాజేశ్గౌడ్, మార్కెట్ డైరెక్టర్ సాలమ్బిన్ ఉమర్, మైనార్టీ నా యకులు అన్వర్ హుస్సేన్, కవిసాబ్, గులామ్ మహ్మద్ త దితరులు పాల్గొన్నారు. పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ పావని, కమిషనర్ రాజయ్య ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేశారు. పట్టణంలో 15వ వార్డులో కౌన్సిలర్ కౌస ల్య ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో మండల కో ఆప్సన్ సభ్యురాలు నాగలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు దండప్ప, మల్లికార్జున్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా పిచ్చి మొక్కల తొలగింపు, డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేశారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. పట్టణ ప్రగతిలో భాగంగా బల్దియాలోని అన్ని వార్డుల్లో ప్రత్యేకాధికారులు ముమ్మరంగా ప్రగతి పనులు చేయిస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటి ఎదుట ఆరు మొక్కలు నాటాలి
బల్దియాలోని ప్రతి ఇంటి ఎదుట ఆరు మొక్క లు నాటాలని, మున్సిపాలిటీని ఆదర్శవంతంగా మార్చాలని మున్సిపల్ చైర్పర్సన్ శిరీష కోరారు. శుక్రవారం మున్సిపాలిటీలో ప్రతి ఇంటికీ తిరుగు తూ ఆరు మొక్కలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగం గా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి ఆకుపచ్చని ము న్సిపాలిటీగా తీర్చిద్దిదాలన్నారు. ఏ కాలనీకి వెళ్లిన పచ్చదనాన్ని సంతరించుకోవాలన్నారు. అందుకు కౌన్సిలర్లందరూ సహకరించాలన్నారు.