ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్

హైదరాబాద్: నగర శివార్లలో వరుస ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న కేసును పోలీసులు ఛేదించారు. వనస్థలీపురంలో వరుస ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న మేవత్ గ్యాంగ్ను రాచకొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా రాజస్థాన్కు చెందినదిగా గుర్తించారు. ముఠాలోని ఆరుగురు సభ్యులను పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. వారి నుంచి లారీ, నగదు, కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
మేవత్ గ్యాంగ్ గత కొంత కాలంగా నగర శివార్లలోని సెక్యూరిటీలేని ఏటీఎంలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నది. ఇప్పటివరకు 11కుపైగా ఏటీఎంలలో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన ఓ దొంగ ఇచ్చిన సమాచారంతో చోరీలకు పాల్పడుతున్నదని పోలీసులు తెలిపారు. బీహార్లోని ఔరంగాబాద్లో ఏటీఎంను పగులగొట్టి రూ.22 లక్షలు అపహరించారని వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్టులో వారం రోజుల వ్యవధిలో రెండు ఏటీఎంలలో చోరీ జరిగింది. యూనియన్ బ్యాంక్లో చోరీకి ప్రయత్నించిన దొంగలు, ఇండిక్యాష్ ఏటీఎంను గ్యాస్ కట్టర్తో కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. ఇండీక్యాష్ ఏటీఎంలో గ్యాస్ కట్టర్లతో మిషన్లను తొలగించి లక్షల రూపాయలు దొంగిలించినట్లు అక్కడున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
<p>లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో.<b><font color="#0000ff"> <a href="https://play.google.com/store/apps/details?id=com.namasthetelangana" target="_blank">నమస్తే తెలంగాణ</a></font></b><a </a> ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.<br></p>
తాజావార్తలు
- 'ధరణితో భూ రికార్డులు వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థలోకి'
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్పై విప్ బాల్క సుమన్ సమీక్ష
- "ఉపశమనం కోసం లంచం" కేసులో డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అరెస్ట్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
- భారత్ గిఫ్ట్.. స్వీకరించిన భూటాన్ ప్రధాని
- క్రికెట్ ఫ్యాన్స్కు బీసీసీఐ గుడ్ న్యూస్!