చండీగఢ్: నకిలీ రెమ్డెసివిర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును పంజాబ్ పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారుడితోపాటు ఆరుగురిని రోపర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల నగదుతోపాటు నకిలీ రెమ్డెసివిర్ తయారీకి వినియోగిస్తున్న ఇంజెక్షన్ సీసాలు, ప్యాకింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంతరాష్ట్ర నకిలీ రెమ్డెసివిర్ తయారీ రాకెట్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.