ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లికి చెందిన ప్రముఖ సాహితీవేత్త ముళ్లపూడి నియోగి (60) సోమవారం అనారోగ్యంతో హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో మృతిచెందారు. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని నేరేడ్ మెట్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. నియోగి ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ముళ్లపూడి కామేశ్వరరావు కుమారుడు. ఈయన సత్తుపల్లి సృజన సాహితీ సమాఖ్య సంస్థలో క్రియాశీలక సభ్యుడిగా సేవలు అందించారు.
ఈయన రచనలు ‘ఆర్తి, వల్లడి, నెగళ్లు’ రచనలు వరుసగా రాజా రామ్మోహన్రాయ్ లైబ్రరీ ఫౌండేషన్కు ఎంపికయ్యాయి. తెలంగాణ ఉద్యమంపై రచించిన ‘కొలిమి’ కవితా సంకలనాన్ని 2014లో ఖమ్మంలో జరిగిన ‘కదన భేరి’ సభలో ఉద్యమనేత కేసీఆర్ ఆవిష్కరించారు. అంతేకాదు సుదీర్ఘకాలంలో ఈయన పాత్రికేయ వృత్తిలో కొనసాగారు.
సాహితీ రంగంలో అనేక రాష్ట్రస్థాయి అవార్డులను గెలుచుకున్నారు. ఆయన మృతి పట్ల సృజన సభ్యులు గట్టే వాసు, రామకృష్ణ, ఆడమ్స్, మధుసూదన్రాజు, రాజేశ్వరరావు, చిత్తలూరి ప్రసాద్, అయ్యదేవర శేషగిరిరావు సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రకు చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా చెక్కు
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే