హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యుడు మధుకర్ పండిట్ మృతి చెందారు. సోమవారం మరణించిన మధుకర్ మృతిపట్ల పలువురు వైద్య రంగ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయనకు భార్య మేథా పండిట్, నలుగురు కుమార్తెలున్నారు. ఇంగ్లాండ్లో వైద్య విద్యను అభ్యసించిన మధుకర్ వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో సివిల్ సర్జన్గా సేవలందించడమే కాకుండా.. కింగ్కోఠి సూపరింటెండెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. మంగళవారం జూబ్లిహిల్స్ మహా ప్రస్థానంలో డాక్టర్ మధుకర్ అంత్యక్రియలు ముగిశాయి.