హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,982 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 5,186 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 48,110 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇవాళ 71,616 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 607 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి 262, ఖమ్మం 247, మేడ్చల్ జిల్లాలో 225 కేసులు నమోదు అయ్యాయి.