వరంగల్ రూరల్ : నెక్కొండ మండలంలోని అలంకానిపేట, నెక్కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీహెచ్సీలలో రోజు నిర్వహిస్తున్న కొవిడ్ టెస్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లకు అందిస్తున్న చికిత్స, మందులు, పలు విషయాలపై వైద్య సిబ్బందితో మాట్లాడారు. పాజిటివ్ వచ్చిన వారు తప్పకుండా 15 రోజులు హోం ఐసోలేషన్ లో ఉండే విధంగా పేషెంట్లకు అవగాహన కల్పించాలన్నారు.
ఇంట్లో తగు సౌకర్యాలు లేకపోతే నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఉచిత ఐసోలేషన్ కేంద్రానికి పంపాలని వైద్య అధికారులకు సూచించారు.