బెంగళూరు : బంగ్లాదేశ్కు చెందిన యువతిపై కర్ణాటకకు చెందిన కొంత మంది యువకులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తుండగా.. శ్రీరాంపుర్లోని ఓ తుక్కు గోదాంలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ తుక్కు గోదాం వద్దకు వెళ్లగానే ప్రధాన నిందితుడు షాబాజ్ వారిని గమనించి పరారీ అయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు కత్తి చూపించి బెదిరించాడు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్తో పాటు ఎస్ఐకి గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం నిందితుడు షాబాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశారు.
బంగ్లాదేశ్ యువతి(22)ని షాబాజ్తో పాటు కొందరు మానవ అక్రమ రవాణా ద్వారా బంధించారు. ఆ తర్వాత ఆ యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఈ క్రమంలోనే షాబాజ్కు ఆమెకు మధ్య ఆర్థిక వివాదాలు మొదలయ్యాయి. దీంతో ఆ యువతిపై అత్యాచారం చేసి ప్రయివేటు భాగాల్లో సీసాలు చొప్పించి చంపేశారు.