జైపూర్ : మైనర్ బాలికకు అభ్యంతరకర మెసేజ్లు, వీడియోలు పంపిన పోలీస్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ఘటన రాజస్ధాన్లోని అజ్మీర్లో వెలుగుచూసింది. పిసంగన్ పీఎస్లో పనిచేసే నిందితుడు విక్రం సింగ్పై ఐటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
సింగ్ గత కొద్ది నెలలుగా బాలికను వేధిస్తున్నాడని నిందితుడిపై ఫిర్యాదు చేసిన పిసంగన్ పంచాయితీ సమితి సభ్యుడు ప్రదీప్ కుమవాత్ వెల్లడించారు. ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్ సింగ్పై కేసు నమోదు చేశామని, దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్ట్ చేస్తామని అజ్మీర్ ఎస్పీ జగదీష్ చంద్ర శర్మ తెలిపారు. నసీరాబాద్ సదర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఈ కేసును విచారిస్తున్నారని పోలీసులు చెప్పారు.