చోరీకి గురైన మందులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఖమ్మం : జిల్లా లోని కొణిజర్ల మండల కేంద్రంలో చోరీకి గురైన రూ. 30 లక్షల విలువైన మెడిసిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న కంటైనర్ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి మధిర వెళ్తున్న ఆర్టీసీ బస్ కంటైనర్ ను ఢీకొట్టడంతో అందులోని మందులతో సహా కంటైనర్ రోడ్డు పక్కన పడిపోయింది. దీంతో డ్రైవర్ ఆ రాత్రి లారీ వద్ద ఉండి తెల్లవారి ఉదయం టిఫిన్ చేసేందుకు సమీపంలోని హోటల్ కి వెళ్లాడు.
తిరిగి అతను వచ్చి చూసే సరికి 5 బాక్సులు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు నిర్వహించిన పోలీసులు రఘునాధపాలెం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డట్లు గుర్తించారు. మంగళవారం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మెడిసిన్ విశాఖపట్నంలోని ఓ పేరు మోసిన కంపెనీకి చెందినదిగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
తాజావార్తలు
- బీటీపీఎస్ 3వ యూనిట్ సింక్రనైజేషన్ సక్సెస్
- పండుగవేళ కేటీఆర్పై అభిమానం..
- టీఆర్పీ స్కాం: రిపబ్లిక్ టీవీ సీఈవో గోస్వామి జైలుకెళ్లాల్సిందే
- బాలుడికి లింగ మార్పిడి చేసి.. మూడేండ్లుగా లైంగికదాడి
- తక్కువ వడ్డీరేట్లు.. ఇంటి రుణానికి ఇదే సరైన టైం!
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
- మిలిటరీతో లింక్స్:జియోమీపై ట్రంప్ నిషేధం!
- ప్రణాళికా బద్దంగా పని చేయాలి : వినోద్ కుమార్