నిర్మల్ అర్బన్ : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, అకారణంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై నిర్మల్ జిల్లా పోలీసులు కొరడా ఝుళిపించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో అకారణంగా తిరుగుతున్న 96 మందిని పట్టుకొని కొవిడ్ నిర్ధారణ పరీక్ష కేంద్రానికి ప్రత్యేక వాహనంలో తరలించారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని నిర్మల్ జిల్లా ఇన్ చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
కుటుంబ సభ్యులను పిలిపించి వారి ముందే కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. 30 వాహనాలను సీజ్ చేశారు. వీటిని లాక్ డౌన్ తర్వాత అప్పగిస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సోన్ సీఐ జీవన్ రెడ్డి, జిల్లా వైద్య అధికారి ధన్ రాజ్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేశవాపురం లిఫ్ట్కు శంకుస్థాపన
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్