అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమందేపల్లి జగ్జీవన్ రామ్నగర్కు చెందిన హరిజన నాగేంద్ర(35)ను మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా నరికి హతమార్చారు.
ఉదయం హత్య జరిగిన విషయం వెలుగులోకి రావడంతో పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా, సీఐ శ్రీహరి, ఎస్ఐ వెంకట రమణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
కాలనీవాసులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య స్థానికంగా కలకలం సృష్టించింది.