జగిత్యాల : అన్నదాతను మోసం చేయాలని చూస్తున్న కల్తీ విత్తన ముఠాలపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. నాసిరకం విత్తన పీడ నుంచి రైతాంగాన్ని విముక్తి చేసేందుకు వరుస దాడులతో దడ పుట్టిస్తున్నది. జిల్లాలోని మెట్పల్లి మండలం చౌలమద్ది పంచాయతీ పరిధిలోని మారుతీనగర్లో నకిలీ విత్తన తయారీ కేంద్రంపై గురువారం టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేయగా ఈ అక్రమ వ్యవహారం వెలుగు చూసింది.
లూజ్ వరి విత్తనాలను గాయత్రీ సిడ్స్ లేబుళ్లతో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రూ. 6.50 లక్షల విలువైన 328 క్వింటాళ్ల నాసిరకం విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కోరుట్ల మండలం యెఖీన్పూర్కు చెందిన సీడ్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్వాహకుడు గడిపె కొమురయ్యపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
మినీ ఇండియాగా శ్రీరామ కాలనీ : మంత్రి సబిత
కాగజ్నగర్లో భారీ గుట్కా డంప్ స్వాధీనం
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం