జోగులాంబ గద్వాల : జిల్లాలో నకిలీ విత్తనాలను జీరో స్థాయికి తేవడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఐజ మండలం మేడికొండ గ్రామంలో నకిలీ కేటుగాళ్లు ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకoగా వలపన్ని 3.2 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు ఎక్కువ కావడంతో మేడికొండ గ్రామానికి చెందిన చిన్న ఈశ్వర్ ఎవరికి అనుమానం రాకుండా ఊరి బయట ఉన్న ఒక ఆశ్రమంలో నకిలీ పత్తి విత్తనాలను దాచాడు. ఆ పరిసర గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచిన ఇన్స్పెక్టర్ జనార్దన్, ఎస్సై నరేష్ కుమార్ ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ బృందo పక్కా సమాచారంతో ఆశ్రమంలో దాడులు నిర్వహించి 3.2 క్వింటాళ్ల నకిలీ పట్టివిత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మండల ఏవో ఫిర్యాదు మేరకు ఐజ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బాలిక వైద్యానికి అండగా ఎమ్మెల్సీ కవిత
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత