హైదరాబాద్ : జగద్గిరిగుట్టలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 14వ తేదీన జావేద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు శుక్రవారం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి డిమాండ్కు తరలించారు. శ్రీహరి అనే వ్యక్తి జావేద్ను కత్తితో పొడిచి చంపాడు. ఇతనికి సహకరించిన జుబేర్(25), విజయ్(20) అనే మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.