జయశంకర్ భూపాలపల్లి : ఏసీబీ అధికారినంటూ దందాలకు పాల్పడుతున్న ఓ నకిలీ ఏసీబీ అధికారిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. జిల్లాలోని రేగొండ మండలంలో నకిలీ ఏసీబీ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం..కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన పత్తి శ్రీనివాస్ అనే వ్యక్తి (వెంకటేష్ )పేరుతో నకిలీ ఏసీబీ అధికారిగా అవతారమెత్తాడు. అధికారులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
రేగొండ మండల కేంద్రంలో పంచాయతీ రాజ్ ఏఈకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా..ఏఈ రేగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఎస్ఐ కృష్ణ ప్రసాద్ సిబ్బందితో పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద 20,000 వేల రూపాయలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మోడల్ స్కూళ్లు అధునాతన దేవాలయాలు
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్