అహ్మదాబాద్ : మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఆమె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బెదిరించిన ముగ్గురు వ్యక్తులను గుజరాత్ పోలీసులు ఆదివారం ఆనంద్లో అరెస్ట్ చేశారు. నిందితులను ఫోటోగ్రాఫర్గా పనిచేసే సందీప్ కుమార్ చంద్రశేఖర్, వైద్యుడు డాక్టర్ మెహుల్ ప్రజాపతి, అడ్వకేట్ ప్రద్యుమ్నసింహ్ గొహిల్గా గుర్తించారు. గత ఏడాదిన్నరగా ముగ్గురు నిందితులు మహిళపై లైంగిక దాడికి పలుమార్లు కుట్రపన్నారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు బలవంతంగా ఆమె ప్రైవేట్ ఫోటోలను తీసి వాటిని బహిర్గతం చేస్తామని బెదిరించారు. ఆనంద్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగేండ్ల కిందట మహిళకు ఫోటోగ్రాఫర్ సందీప్ కుమార్తో పరిచయం ఏర్పడగా ఏడాదిన్నర నుంచి అతడు డబ్బు ఇవ్వాలని కోరడంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. అప్పటి నుంచి అతడికి మహిళ దూరంగా ఉంది. ఈ క్రమంలో ఉద్యోగం పేరుతో అడ్వకేట్ ప్రద్యుమన్ గొహిల్ మహిళకు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. తనను సందీప్ వేధిస్తున్నాడని ఆమె గొహిల్కు చెప్పడంతో తాను మాట్లాడతానని చెప్పి ఆమెను హోటల్కు పిలిపించాడు. సందీప్కు తాను డబ్బు ఇచ్చానని చెబుతూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫోటోలు, వీడియోలు రికార్డు చేశాడు.
కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆమెను హోటల్కు రావాలని పిలిస్తే ఆమె నిరాకరించడంతో అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేస్తానని బెదిరించి ఆమెపై మరోసారి లైంగిక దాడికి తెగబడ్డాడు. అడ్వకేట్ ఆమెపై దారుణానికి ఒడిగడుతుండగా బాత్రూంలో దాక్కున్న సందీప్ ఆ ద్రుశ్యాలను కెమెరాలో రికార్డు చేసి వాటిని లీక్ చేస్తానని బెదిరిస్తూ బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఇక మహిళ అస్వస్ధతకు గురికావడంతో ఆమె డాక్టర్ మెహుల్ ప్రజాపతి అనే వైద్యుడి వద్దకు వెళ్లింది.
ఆ పరిచయం అవకాశంగా తీసుకున్న డాక్టర్ తరచూ ఆమెకు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. డాక్టర్ నెంబర్ను ఆమె బ్లాక్ చేయగా మరో నెంబర్ నుంచి ఇతర ఇద్దరు నిందితులు తీసిన మహిళ ఫోటోలు, వీడియోలను ఆమెకు పంపి లోబరచుకున్నాడు. అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా ముగ్గరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.