జైపూర్: మైనారిటీ కూడా తీరని బాలికపై అత్యంత కిరాతకంగా అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో రాజస్థాన్లోని పోక్సో కోర్టు సంచలన తీర్పు వెల్లడిచింది.ఈ కేసులో నిందితుడు దోషిగా తేలినందున మరణదండన విధిస్తున్నట్లు ప్రకటించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదైన 26 రోజుల్లోనే అధికారులు ఈ కేసు దర్యాప్తు పూర్తిచేశారు. దాంతో 27వ రోజు కోర్టు దోషికి శిక్ష విధించింది. కాగా, చిన్నారిపై దోషి అత్యాచారానికి ఒడిగట్టిన తీరు అత్యంత హేయమైనదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించారు. మరణదండనే అతనికి సరైన శిక్ష అని పేర్కొన్నారు.