పాట్నా: బీహార్లోని జెహనాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మద్యం కేసు నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలో మరణించాడు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించడంతోపాటు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. మరోవైపు కర్రలతో స్వైర విహారం చేసిన గ్రామస్తుల గుంపు నుంచి రక్షించుకునేందుకు పరుగెత్తిన మహిళా కానిస్టేబుల్ మీదుగా ఒక వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆమె చనిపోయింది. కాగా, ఉద్రిక్తల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. దీనికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి అశోక్ పాండే తెలిపారు.