హైదరాబాద్ : నగరం నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 165 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు మూడు సరుకు రవాణా ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. అరెస్టైన వ్యక్తులు ముషీరాబాద్కు చెందిన మహ్మద్ ఖాదీర్(33), మొహ్మద్ సమి(27), మహ్మద్ ఖాదీర్(27) గా గుర్తించారు. కాగా పరారైన వ్యక్తులు ముషీరాబాద్కు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ దావూద్(25), బోయినపల్లికి చెందిన మహ్మద్ అక్బర్, రసూల్పూరాకు చెందిన కరీం. అందిన సమాచారం మేరకు ముషీరాబాద్, బేగంపేట, అల్వాల్లో రైడ్ చేసినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ పి. రాధా కృష్ణా రావు తెలిపారు. పరారైన నిందితుల ఆచూకీకి గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.