వరంగల్ అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన సాదు రాజుపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఆదివారం పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు. పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను మడికొండ ఇన్స్పెక్టర్ రవికుమార్ హైదరాబాద్ చంచల్ గూడ కేంద్రకారాగారంలో ఉన్న నిందితుడికి జైలు అధికారుల సమక్షంలో పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసారు.
నిందితుడు సాదు రాజు గతంలో చోరీలకు పాల్పడటంతో జైలుకెళ్లి తిరిగి వచ్చినా నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు. మడికొండ, కేయూసి, మీల్స్ కాలనీ, నర్సంపేట, పర్కాల, గీసుగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలుచోరీలకు పాల్పడిన సంఘటనలో నిందితుడుని మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ. 7లక్షల 40వేల విలువగల 119 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశామని సీపీ తెలిపారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
దేశానికే ఆదర్శం ఇంటింటికి జ్వర సర్వే : ఎమ్మెల్సీ కవిత
బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
రెండు రోజుల్లో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి