జోగులాంబ గద్వాల : నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తూ రైతులను మోసం చేస్తున్న వజ్జగోని నరసింహ గౌడ్ పై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. అనంతరం నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దోడ్డి గ్రామానికి చెందిన వజ్జగోని నరసింహ గౌడ్ మల్డకల్ పోలీస్ స్టేషన్, దరూర్ పోలీస్ స్టేషన్ పరిధి అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు అక్రమ సరఫరా చేస్తూ రైతులను మోసగిస్తున్నాడు. దీంతో ఇతడిపై జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ పీ.డీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేశారు. గద్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జక్కుల హన్మంతు, మల్డకల్ ఎస్ఐ ఆర్. శేఖర్ లు నరసింహకు నిర్బంద ఉత్తర్వులు అందజేసి అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.