Crime
- Jan 03, 2021 , 21:53:47
హ్యుమన్ ట్రాఫికర్స్ ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు

హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాదారులు ఇద్దరిపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. ఎం.రాజేశ్వరి(27), బి. నరేశ్(25)ను ప్రివెన్టీవ్ డిటెన్షన్(పీడీ) యాక్ట్ కింద బుక్ చేశారు. ఇరువురు నగరంలోని ఉప్పల్ పరిధిలో గల సత్యనగర్ కాలనీవాసులు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అదేవిధంగా పశ్చిమ బెంగాల్ నుంచి మహిళలను తీసుకువచ్చి అద్దె ఇండ్లలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఉద్యోగ అవకాశాల కల్పనతో యువతులను కూడా ప్లాన్ ప్రకారం ఈ రోంపిలోకి లాగుతున్నారు. ఇరువురిని గడిచిన డిసెంబర్లో అరెస్టు చేసిన పోలీసులు వీరి చెర నుంచి ఇద్దరు యువతులను రక్షించారు.
తాజావార్తలు
- చదువుకోక టీవీ చూస్తున్నాడని నిప్పంటించాడు
- కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
- మేడారం మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
- అంగన్వాడీల సేవలు మరింత విస్తరణ
- దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామి
- శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ.. భారత్ 70/1
- మామిడి విక్రయాలు ఇక్కడే
- దేశవ్యాప్తంగా ‘డిక్కీ’ని విస్తరిస్తాం
- కొత్తపుంతలు తొక్కుతున్న వస్త్రపరిశ్రమ
MOST READ
TRENDING