నాగర్కర్నూల్ : ఆర్టీసీ బస్సుకు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో ప్రయాణికురాలు మృతి చెందింది. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. కల్వకుర్తి నుంచి అచ్చంపేటకు ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బయల్దేరింది. కల్వకుర్తి శివారులో బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో ప్రయాణికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో ఓ మహిళ బస్సులోనే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు