పరిగి టౌన్ : ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చి అనంతలోకాలకు వెళ్లిన సంఘట మండల పరిధిలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద చోటు చేసుకుంది. ఆదివారం పోలీసులు తెలిపిన విరాల ప్రకారం.. నగరంలోని సూరారం గ్రామానికి చెందిన రాజేష్ తన ఏడుగురు స్నేహితులతో కలిసి వికారాబాద్ ప్రాంతంలోని అనంతగిరి కొండలను వీక్షీంచేందుకు వచ్చారు. అనంతగిరి వీక్షించిన అనంతరం పరిగి సమీపంలో ఉన్న లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు.
అక్కడ అలుగు పారుతుండటంతో స్నేహితులంతా కలిసి సరదగా సెల్ఫీ దిగుతుండగా రాజేశ్ కాలు జారీ ప్రాజెక్టులో పడ్డాడు. అతనికి ఈత రాకపోవడంతో నీట మునిగాడు. వెంటనే తోటి స్నేహితులు, అక్కడే ఉన్న మత్స్యకారులు సహాయంతో అతనిని ఒడ్డుకు చేర్చారు. ఆ వెంటనే చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతికుమార్ పాటిల్ తెలిపారు.