నిజామాబాద్ : శిశువు విక్రయం కేసులో పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రెంజల్ మండలంలోని మహిళకు నెల రోజులక్రితం పాప జన్మించింది. అయితే పాపను నిజామాబాద్కు చెందిన మహిళకు రూ.50 వేలకు విక్రయించింది. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు తల్లిదండ్రులతో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.