భోపాల్: బెయిల్పై బయటకు వచ్చిన ఒక వ్యక్తి తనను జైలుకు పంపిన మహిళను తుపాకీతో కాల్చి చంపాడు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఒక వ్యక్తి పొరుగింటి మహిళను పెండ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. లైంగిక వేధింపులకు పాల్పడటంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మూడు నెలల కిందట ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. రిమాండ్ కోసం జైలుకు తరలించగా అతడు నెల కిందట బెయిల్పై విడుదలయ్యాడు.
గురువారం ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. గన్ లాక్కుని అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన మహిళ కుటుంబ సభ్యులపై రాళ్లతో దాడి చేసి పారిపోయారు. తుపాకీ కాల్పుల్లో గాయపడిన మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మహిళ సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.